వనపర్తి ప్రభుత్వాసుపత్రికి డా. బాలకృష్ణయ్య గారి పేరు
వనపర్తి పట్టణంలో నూతనంగా నిర్మించనున్న 501 పడకల ప్రభుత్వాసుపత్రికి ప్రముఖ ప్రజావైద్యుడు డాక్టర్ బాలకృష్ణయ్య గారి పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
వనపర్తి పట్టణంలో నూతనంగా నిర్మించనున్న 501 పడకల ప్రభుత్వాసుపత్రికి ప్రముఖ ప్రజావైద్యుడు డాక్టర్ బాలకృష్ణయ్య గారి పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
వనపర్తి నుండి మిత్రులు, అత్యంత శ్రేయోభిలాషులైన డాక్టర్ శ్రీ బాలకృష్ణయ్యగారు ఫోన్ చేసి, మార్చి 12వ తేదీ 1982 శుక్రవారంనాడు వనపర్తిలో సన్మానం ఏర్పాటుచేస్తున్నామని, ఆ వేళకి మరెక్కడా ప్రోగ్రామ్ పెట్టుకోవద్దని, ఇది ఖాయమని చెప్పారు
డాక్టర్ బాలకృష్ణయ్యగారు స్వాతంత్రోద్యమం కాలంలో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి, ఉన్నత విద్యా అవకాశాలను వదిలి, ప్రజాసేవనే తన ధ్యేయంగా స్వీకరించిన మహానుభావుడు.
శాసనసభ్యుడిగా గ్రామాల్లో త్రాగునీటి సౌకర్యాలు, రోడ్లు, పాఠశాలలు, హాస్టల్స్ కోసం కృషి చేశారు. బాలికల విద్య కోసం ప్రత్యేకంగా జూనియర్ కళాశాల ఏర్పాటు చేసి, ప్రతి మండలానికో జూనియర్ కళాశాలను మంజూరు చేయించారు
ఎన్నికల్లో ఆయనకు ఓటు వేయని వారు ఆయన దగ్గరకు వైద్యం కోసం రావడానికి మొహమాటపడేవారు. అలాంటి వారు కలిసినపుడు ఓటు వేయకున్నా కనీసం వైద్యం చేయించుకోండని అడిగేవారు.
స్నేహశీలత పుష్కలంగా తన వ్యక్తిత్వంలో అంతర్భాగాలు చేసుకొన్న చేసుకొన్న గొప్ప వ్యక్తి డాక్టర్ బాలకృష్ణయ్య గారు నాకు చిరస్మరణీయులు. ఇప్పటి తరానికి మార్గదర్శకుడైన మహోన్నతుడు.
మేమంతా హైదరాబాదులోని శ్రీకృష్ణదేవరాయ గ్రంథాలయంలో శ్రీశ్రీకి సన్మానం చేసినపుడు డాక్టర్ గారి సహకారం ఉంది. ఈ సభలోనే అనుకుంటా ఒక మహిళ తన చేతులకున్న రెండు బంగారు గాజులను విరాళాల జోలెలో వేసింది.
డాక్టర్ బాలకృష్ణయ్య గారంటే ఒక మానవీయ స్పర్శ. తల్చుకొంటే మనసు భావోద్వేగానికి గురౌతుంది. వారు ఉన్నతమైన మానవ విలువలకు నిజమైన ప్రతినిధి. మానవతావాది. హేతువాది. అన్నింటికి మించి వామపక్షదృక్పథాన్ని నిలువెల్లా నింపుకొన్న వ్యక్తి.
ఒక మనిషి మనీషిగానేగాక మహావ్యవస్థగా ఎదగవచ్చు అన్నదానికి డాక్టర్ గారి జీవితమే ఓ పెద్ద ఉదాహరణ. ఇది అరుదుగానే జరుగుతుంది. కానీ ఇదే చరిత్రలో నిలుస్తుంది
తరచూ మలేరియా వ్యాధికి గురవు తున్న ఈ ప్రాంత ప్రజలకు ఆయన ఆ తర్వాతి కాలంలో వనపర్తినుండి మందులు తేవడమో, పంపడమో చేస్తుండేవారు. అప్పట్లోనే ఆయన్ను నేను ప్రజలకు నిస్వార్థంగా సేవచేసే మనిషిగా గుర్తించాను.